SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మందమర్రి మండలంలోని  పొన్నారం గ్రామంలో 12 గృహాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముక్య అతిధిగా హాజరై ప్రారంభించారు. .చెన్నూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ ఆశీస్సులతో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన పొన్నారం గ్రామంలో ఈ గృహాలు ప్రారంభమయ్యాయని ఇందులో భాగంగా గురువారం అధికారులు లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారులకు అప్పగించారని గ్రామ సర్పంచ్ పెంచాల మధు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, హౌసింగ్ ఏఈ జోష్ణ, పంచాయతీ కార్యదర్శి హరీష్, గ్రామ ఉపసర్పంచ్ పెంచల అమృత, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

भारतीय जनता पार्टी की जन विश्वास यात्रा का सिद्धार्थनगर में आगमन, उमड़ा जन सैलाब

Web1Tech

మందమర్రి జీఎం కార్యాలయం, కేకే ఓసీపీల లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

siti news telangana

ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

siti news telangana