SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో మార్నింగ్ వాక్ : మంత్రి వివేక్

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా మంత్రి 

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం.వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులపై ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలు తీరును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యాతనపల్లి మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.అలానే మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. కేవలం 9వ వార్డులోనే రూ. 4.80 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.అలాగే అమృత్ పథకం కింద రూ. 40 కోట్లతో తాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, తహసీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్‌,తో పాటు ,స్థానిక కౌన్సిలర్లు ,పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండించిన : రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడ్నాల.శ్రీనివాస్

siti news telangana

మందమర్రి కోర్టు నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ నిర్మల

siti news telangana

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.

siti news telangana