మందమర్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే జర్నలిస్టుల సంక్షేమం కోసం తొలి అడుగు వేసింది. ప్రెస్ క్లబ్ సభ్యుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ గురువారం స్థానిక తహసిల్దార్ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి.రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి సలాముద్దీన్, కోశాధికారి సకినాల.శంకర్, మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.
