SITI NEWS TELANGANA
స్థానిక వార్తలు

50 % సబ్సిడీ పై అందుబాటులోకి జీలుగ విత్తనాలు : మండల వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి

50 % సబ్సిడీ పై అందుబాటులోకి జీలుగ విత్తనాలు 

మందమర్రి మండలంలోని రైతులకు జీలుగ విత్తనాలు 50% సబ్సిడీ పై అందుబాటులోకి వచ్చినట్లు మండల
వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లడుతూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) లో 25క్వింటాళ్ల (83 బ్యాగులు) మందమర్రి ఆగ్రోస్ లో 25 క్వింటాళ్ళు (83 బ్యాగులు) సిద్ధంగా ఉన్నయి అన్ని . మండలంలో మొత్తం 50 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచబడ్డాయి అని , అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, వివరాలతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అలానే మండల వ్యవసాయ అధికారి (AO)ని సంప్రదించాలని తెలిపారు . విత్తనాల పంపిణీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించబడుతుంది. ఒక బ్యాగ్ (2.20)రెండున్నర ఎకరాలు (ఒక హెక్టార్ ) కి సరిపోతుంది.
సబ్సిడీ వివరాలు :
(ఒక బ్యాగుకు – 30 కేజీలు) బ్యాగ్ పూర్తి ధర | రూ. 4,905.00 |
ప్రభుత్వ సబ్సిడీ (50%) | రూ.2,452.50 |
రైతు చెల్లించాల్సిన నికర ధర|  రూ. 2,452.50.
కావున రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .

Related posts

भारतीय जनता पार्टी की जन विश्वास यात्रा का सिद्धार्थनगर में आगमन, उमड़ा जन सैलाब

Web1Tech

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో 100 మొక్కల నాటిన సిబంది.

siti news telangana

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana