మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజన దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మంద.తిరుమల రెడ్డి నేతృత్వాన స్థానిక పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మంత్రి కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్, మహిళా, మైనారిటీ, సేవాదళ్ తో పాటు అనుబంధ సంఘాల శ్రేణులు పాల్గొన్నారు.
