యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది…
మందమర్రి ఏరియాలోని కేకే-1 డిస్పెన్సరీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది, కార్మికులు , స్థానికులు పాల్గొని వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు.
ఈ సందర్భంగా యోగ మాస్టర్ లు మది. శంకర్, పోలు. సంపత్, డాక్టర్ నాగేశ్వర్ రావు యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని అలనే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని వైద్యులు,సిబందికి నిర్వాహకులు అవగాహన కల్పించారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి దూరమై, ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు.

