అర్పిఐ (అత వాలే) పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా దూడం.తిరుపతి..
మందమర్రి మార్కెట్ లోని అర్పిఐ (అత వాలే) పార్టీ కార్యాలయంలో శనివారం సీనియర్ నాయకుల సమావేశంలో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి.రమేష్ పేరుకొన్నారు.ఈ సమవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ నూ సీనియర్ నాయకులు శాలువాతో సత్కరించారు.
అనతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పాత కమిటిని రద్దు చేస్తు, జిల్లా నూతన అధ్యక్షుడిగా దూడం. తిరుపతిని నియమిస్తునట్టు ప్రకటించారు. పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త తమ శక్తివంత మేరకు పనిచేసి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అలనే ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం న్యాయం పక్షాని నిలవాలని పిలుపునిచారు. తదంతరం మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షునికి నియామక పాత్రని అందజేశారు. అదేవిధంగా తనాపై నమ్మకంతో ఇచిన పదవిని దుర్వినియోగం చేయకుండా పార్టీ పటిష్ట కై కష్టపడతానని తిరుపతి అన్నారు.ఈ సమావేశంలో చంద్రగిరి.చక్రపాణి, అట్వాల్.అనిల్ కుమార్, ఎండి.యాకూబ్, కన్నూరి. కృష్ణ, పులిపాక. శ్రీనివాస్, చింతల.రాజ్ తదితరులు పాల్గొన్నారు.
