చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలో అక్రమ మట్టి దందా మూడు పువ్వులు…ఆరు కాయలుగా సాగుతోంది.కొంతమంది అక్రమార్కులు అడ్డ దారిలో నిబంధనలకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జైపూర్ మండలం ఎల్కంటి ఊర చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం చెరువు లో మట్టిని స్థానిక రైతుల పంట పొలాల్లో ప్రజల అవసరాన్ని బట్టి ఇళ్లల్లో పోసుకోవడానికి అనుమతులు ఇచ్చారు.అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన రాత్రింబవళ్లు పెద్దపల్లి జిల్లాకు మట్టి రవాణా చేస్తున్నారు.అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డు కోవడంతో ఎట్టకేలకు వాటిని స్థానిక పోలీసేస్టేషన్ కు తరలించారు.

