SITI NEWS TELANGANA
తెలంగాణ

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం లో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్, మంచిర్యాల, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు ధర్ని మధుకర్, మహంకాళి స్వామి లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని , రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2 వేల 216 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నామని, సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, రాబోవు గోదావరి పుష్కరాలలో పుష్కర ఘాట్ల నిర్మాణం, అవసరమైన వసతుల కొరకు 1 వేయి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని , బాసర నుండి భద్రాచలం వరకు 802 కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక కారిడార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు 70 కోట్ల రూపాయల నిధులతో గూడెం దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, పిప్రి వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి చే గూడెం ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి 37 రోజుల వ్యవధిలోనే పనులు చేపట్టడం జరుగుతుందని . రాష్ట్రంలో ఆధ్యాత్మిక క్షేత్రాల పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని . రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో 74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని . విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయ, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధిలో నియోజకవర్గ శాసనసభ్యులు కృషి అభినందనీయమని తెలిపారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

Related posts

పేదింటి ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు : గృహ నిర్మాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

siti news telangana

వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసేందుకు ముగ్గు చూపాలి

siti news telangana

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన..

siti news telangana